పద్మశాలీ నేతలపై కేసులు పెట్టించిన కేకే మహేందర్ !?

-

పద్మశాలీ నేతలపై కేసులు పెట్టించారు కేకే మహేందర్. కేకే మహేందర్ వర్సెస్ సిరిసిల్ల పద్మశాలీ సంఘం నేతలు అన్నట్లుగా వివాదం కొనసాగుతోంది. పద్మశాలీలు పాపడాలు, నిరోధ్‌లు అమ్ముకోండి అంటూ సిరిసిల్లా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మశాలీలకు బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇవ్వబోమని…పద్మశాలీలు బతుకమ్మ చీరల పేరిట 6 ఏండ్ల నుండి దొబ్బి తింటున్నది సరిపోదా అంటూ నేతన్నలపై ఫైర్‌ అయ్యారు.

kk mahender reddy 

పద్మశాలీలు పాపడాలు, నిరోధ్‌లు అమ్ముకొండి అంటూ సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి జుగుప్సాకరమైన మాటలు చేశారు. దింతో కేకే మహేందర్ వర్సెస్ సిరిసిల్ల పద్మశాలీ సంఘం నేతలు అన్నట్లుగా వివాదం కొనసాగుతోంది. తాజాగా కేకే దిష్టిబొమ్మ దహనం తో 16 మంది పద్మశాలీ నేతలపై కేసులు పెట్టారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచారని కేకే పై పద్మశాలీ సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల పోలీసుల తీరుపై కేటీఆర్‌‌కు ఫిర్యాదు చేసారు పద్మశాలీ సంఘం నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news