వేముల వీరేశంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..టికెట్‌ కోసమే డ్రామాలు !

-

వేముల వీరేశంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్‌ కోసమే డ్రామాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళాంల గ్రామంలోకాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..నకిరేకల్‌ టికెట్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పని చేసిన తాజా, మాజీ ఎమ్మెల్యే లు ఏనాడు ప్రజల సమస్యలను పట్టించుకోలే.

సొంత ఆస్తులను కూడబెట్టుకోవడానికే మొగ్గు చూపారని… నకిరేకల్ నియోజకవర్గం నాకు రెండో కన్ను లాంటిదని పేర్కొన్నారు. నేను ఎవరి పేరు ప్రతిపాదిస్తే నకిరేకల్ లో వారికే టికెట్ వస్తుందని… నిన్నటి వరకు టికెట్ వస్తుందని చెప్పుకుంటూ వీరేశం తిరిగారు….టికెట్ రాదని తెలిస్తే కేసీఆర్ ఫోటో పక్కన పడేసి కాంగ్రెస్ అంటున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు గతంలో ఎన్నికల‌ ముందు పసుపు కుంకుమ పేరుతో మహిళలను ప్రలోభాలకు గురిచేశాడు..అయినా జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారన్నారు. ఇక్కడ కూడా అవుటర్ లీజు, వైన్ షాపుల్లో వచ్చిన డబ్బుల్ని ఎన్నికల కోసం వాడుతున్నారు….అయినా ప్రజలు నమ్మరు. కాంగ్రెస్సే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు కోమటిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news