రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు చాలా తప్పు..ఉచిత కరెంట్‌ ఇవ్వాల్సిందే – కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

-

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు చాలా తప్పు..ఉచిత కరెంట్‌ ఇవ్వాల్సిందే అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు 3 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వాలి అన్న రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతమైనవి. ఆయన చెప్తే ఫైనల్ అవుతుందా? అని ఫైర్‌ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుందని చెప్పారు.

 

స్టార్ క్యాంపెనర్‌గా నేను చెప్తున్నా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. నేను రేవంత్ రెడ్డి కేవలం పార్టీకి కోఆర్డినేటర్స్ మాత్రమేనని… సీఎం ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. రేవంత్ అప్పట్లో కాంగ్రెస్ లో లేరు కాబట్టి ఉచిత విద్యుత్ కోసం ఎంత కాటపడ్డామో ఆయనకు తెలియదన్నారు. అమెరికా పోయాక..రేవంత్‌ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news