సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి.. హావభావాలు మార్చుకోవాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గంటలు గంటలు మాట్లాడకుండా.. ఆ శ్రద్ధ పని మీద చూపించాలని చురకలు అంటించారు.

ఇంకో మూడున్నర ఏళ్లు ఆయనే సీఎం.. ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం, ప్రజలు నిర్ణయిస్తారు అని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతిపక్షాలను పదే పదే తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని కోరారు. 20 మంది సీమాంధ్రా కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంకా మూడున్నరేళ్లు రేవంతే సీఎంగా ఉంటాడు కానీ ఆయనకు అంత ఆవేశం పనికిరాదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ప్రతిపక్షాలను పదే పదే తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలి
20 మంది సీమాంధ్రా కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు
ఇంకా మూడున్నరేళ్లు రేవంతే సీఎంగా ఉంటాడు కానీ ఆయనకు అంత ఆవేశం పనికిరాదు… pic.twitter.com/LlH6o1F7XX
— BIG TV Breaking News (@bigtvtelugu) August 6, 2025