36 గంటల నిరసన దీక్ష చేపడుతున్న కొప్పుల ఈశ్వర్

-

పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 36 గంటల నిరసన దీక్ష చేపడుతున్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. తెలంగాణలో రైతుల కోసం ఈ నెల 30, 31వ తేదిల్లో 36 గంటల నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.


“నేను సాధారణమైన వ్యక్తిగా 26 ఏళ్లు సింగరేణి కార్మికుడిగా పని చేశాను. స్థానిక సమస్యలపై అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. కొందరు ఆస్తులను పరిశ్రమలను రక్షించుకోవడం కోసమే పదవులను అడ్డం పెట్టుకుంటున్నారు. హైదరాబాదులో ఉండి ఇక్కడి సమస్యలను ఏ విధంగా తీరుస్తారు. అందుకే ప్రజల మధ్య ఉండే వారికే ఓటు వేయండి.” అని కొప్పుల ఈశ్వర్ కోరారు.కేసీఆర్ సర్కార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల పాలన మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు కొప్పుల.

 

Read more RELATED
Recommended to you

Latest news