రక్షా బంధన్ వేళ జైల్లో కవిత.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

-

ఇవాళ రాఖీ పౌర్ణమి. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ సంబురాన్ని జరుపుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు కూడా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు నేతలు తమ తోబుట్టువులతో కలిసి పండుగ జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట షేర్ చేస్తున్నారు.

కానీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి మాత్రం తన సోదరి రాఖీ కట్టడం లేదు. కారణం.. ప్రస్తుతం ఆయన సోదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాఖీపౌర్ణమి వేళ ఎక్స్‌లో మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో సోదరి కవిత తనకు రాఖీ కట్టిన ఫొటోలు షేర్ చేశారు. ఇవాళ రాఖీ కట్టలేకపోయినా ఎప్పటికీ కష్టసుఖాల్లో ఒకరికొకరం అండగా ఉంటామని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. హ్యాపీ రాఖీ రామన్నా అంటూ నెటిజన్లు రక్షా బంధన్ విషెస్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news