ఏ రైతు కూడా కరవు కోరుకోడు.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

-

కర్ణాటక మంత్రి శివానంద పాటిల్పై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ విరుచుకు పడ్డారు. రైతులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తమ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేందుకు రైతులు ఏటా కరవును కోరుకుంటున్నారని శివానంద పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికే కన్నడ నాట తీవ్ర దుమారం రేపాయి. మంత్రి కామెంట్స్పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. మరోవైపు ఆ రాష్ట్ర రైతులు కూడా మంత్రి వివాదంపై చాలా ఫైర్గా ఉన్నారు.

తాజాగా కర్ణాటక మంత్రి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. రైతుల గురించి హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్న వీరు.. ఏం మంత్రులని ప్రశ్నించారు. ఏ రైతు కూడా కరవు కోరుకోరని అన్నారు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లోనూ రైతులు కోరుకునేది ప్రభుత్వం నుంచి సానుభూతి మాత్రమేనని కేటీఆర్‌ పేర్కొన్నారు. అక్కడి కాంగ్రెస్ సర్కార్లో రైతులు ఎంతటి బాధలు పడాల్సి వస్తుందో చూస్తున్నామని.. తెలంగాణ రైతులకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version