రైతులు కష్టాల్లో ఉంటే… రేవంత్ రెడ్డి..ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు – కేటీఆర్‌

-

రైతులు కష్టాల్లో ఉంటే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి…..సాగునీరు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25,000 ల నష్ట పరిహారం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఇది కాలం తెచ్చిన కరువు కాదు…కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ చురకలు అంటించారు మాజీ మంత్రి కేటీఆర్‌.

ktr in siricilla

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు కేటీఆర్‌. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ….కేసీఆర్ ఏడువేల కోట్లు రైతు బంధు కోసం పెట్టిపోతే…అవి కూడా రైతులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్ లకు ఆ డబ్బు ఇస్తోందని ఫైర్‌ అయ్యారు. రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది… ఇది కాలం తెచ్చిన కరువు కాదు ,కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విమర్శలు చేశారు. గతేడాది ఇదే సమయానికి నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం…. కాళేశ్వరం ,కేసీఆర్ పై కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news