BREAKING :మంత్రి కేటీఆర్‌ ఖమ్మం పర్యటన రద్దు..

-

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారకరామారావు రేపటి ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఈ- కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశం పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాలలో రేపు మంత్రి కేటీఆర్‌ పాల్గొనాల్సి ఉంది.

కానీ… బీజేపీ పార్టీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారకరామారావు రేపటి ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఇక ఒకటి, రెండు రోజుల్లో కేటీఆర్ గారి ఖమ్మం పర్యటన తదుపరి తేదీల ప్రకటన రానుంది. కాగా.. ఈ నెల 14 వ తేదీన ఖమ్మం ట్రీ టౌన్‌ స్టేషన్‌ ముందు సాయి గణేష్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే బీజేపీ పార్టీ కార్యక్తలు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. నిన్న ఆస్పత్రిలో చికిత్స మరణించాడు సాయి గణేష్‌. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version