ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం… బెదిరించి కన్న కూతురుపైనే అత్యాచారం

-

కామాంధులు వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. తనపర భేదం లేకుండా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. బాలికను కంటికి రెప్పలా కాపాడాల్సిన బంధువులే చిదిమేస్తున్నారు. రక్తం పంచుకుపుట్టిన కూతుర్లపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. కళ్లలో పెట్టుకుని చూడాల్సిన తండ్రులే తమ కామవాంఛకు కూతుళ్లను బలి చేస్తున్నారు. ఇటీవల ఇటువంటి సంఘటలు చాలానే జరుగుతున్నాయి. కన్న కూతుళ్లకు మాయమాటలు చెప్పి, బెదిరించి అత్యాాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. 

తండ్రి కూతురు బంధానికి మాయనిమచ్చ తెచ్చాడు ఓతండ్రి. ఉత్తర్ ప్రదేశ్ సహరాన్ పూర్ లో కన్న తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బెదిరించి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక ఎప్రిల్ 9న సదర్ బజార్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించింది. అత్యాచారం చేసిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదు చేశారు. అయితే కొన్ని రోజుల పాటు నిందితుడు తప్పించుకుని తిరిగినా… పోలీసులు వెతికి పట్టుకున్నారు. నిందితుడిని జైలుకు పంపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version