ఢిల్లీ పర్యటనలో కేటీఆర్‌…కవిత రిలీజ్‌ కాబోతున్నారా?

-

ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రి కేటీఆర్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు కేటీఆర్‌. ఈ సందర్భంగా తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్‌ కానున్నారు కేటీఆర్‌. అటు ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది ఢిల్లీ కోర్టు.

BRS Working President KTR responded to the concern of groups candidates and unemployed

లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యానికి గురి అయ్యారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న ఎమ్మెల్సీ కవిత మొన్న నీరసంతో కళ్లు తిరిగిపడిపోయింది. ఇక ఇదే సమయంలో… కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల పై సోనియా గాంధీతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సిఎం భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాగాంధీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news