BRS కు 88 సీట్లు పక్కా…రేవంత్ కు రెండు చోట్ల ఓటమి – కేటీఆర్

-

హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఈ సందర్బంగా రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేసారు కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. మరోసారి భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు. ఈసారి 88 సీట్లు తమ పార్టీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

పెద్దపెద్ద నాయకులు కూడా ఓడిపోతారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్ మరియు కామారెడ్డి లో కూడా ఓడిపోతాడని బాంబు పేల్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలంతా గులాబీ పార్టీ వైపు ఉన్నారని స్పష్టం చేశారు. ఆత్మగౌరవ ఆకురాయిపైన మన చైతన్యాన్ని పదును పెట్టుకునే రోజు…నవంబర్ 29..దీక్షా దివస్‌ అని తెలిపారు మంత్రి కేటీఆర్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news