10 నెలలు – 25 సార్లు – 50 రోజులు..అయినను పోయి రావాలె హస్తినకు – KTR

-

10 నెలలు – 25 సార్లు – 50 రోజులు..అయినను పోయి రావాలె హస్తినకు అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్లపై KTR సెటైర్లు పేల్చారు. పైసా పనిలేదు – రాష్ట్రానికి రూపాయి లాభం లేదు… 10 నెలలు – 25 సార్లు – 50రోజులు ఢిల్లీలో రేవంత్‌ గడిపాడని మండిపడ్డారు కేటీఆర్‌. పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదంటూ చురకలు అంటించారు.

అన్నదాతల అరిగోసలు, గాల్లో దీపాల్లా గురుకులాలు, కుంటుపడ్డ వైద్యం. గాడి తప్పిన విద్యా వ్యవస్థ ఉన్నా…. అయినను పోయి రావాలె హస్తినకు అంటూ రేవంత్‌ ఢిల్లీకి వెళ్లాడని ఆగ్రహించారు. మూసి పేరుతో – హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి – 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి… పండగలు పండగళ్ళా లేవు ఆడబిడ్డల చీరలు అందనేలేవు అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదు తులం బంగారం జాడనే లేదు స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news