కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయింది – KTR

-

కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రెండు సీజన్లు అయినా.. రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే అన్నారు.

జూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. ఆగష్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వెయ్యలే అని ఆగ్రహించారు. కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే అంటూ మండిపడ్డారు. రైతు కూలీలకు..రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే అని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news