ఆ సర్వే ప్రకారం మాకు 77 సీట్లు పక్కా : KTR ప్రకటన

-

వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. RAJNEETI సర్వే ప్రకారం తమకు 112 సీట్లకు గాను 77 సీట్లు వస్తాయని ట్వీట్ చేశారు. మునుగోడు, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లు కాకుండా మిగతా నియోజకవర్గాలపై సర్వే చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 29, బీజేపీకి 6, బీఎస్సీ-0 సీట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది.

కాగా, తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై శ్రీ ఆత్మ సాక్షి సర్వే విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. బీఆర్‌ఎస్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్‌ మరోసారి అంటే హ్యట్రిక్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాకపోతే.. దాదాపు 20 సీట్లు తగ్గే ఛాన్స్‌ ఉంది.

ఆత్మ సాక్షి సర్వే ప్రకారం… సీట్ల వారీగా

బీఆర్ఎస్ : 64-70
కాంగ్రెస్ : 37-43
బీజేపీ : 5-6
ఏంఐఎం : 6-7
గట్టి పోటీ ఉన్నవి : 6

ఓట్ షేర్ వారీగా
బీఆర్ఎస్ : 42.5%
కాంగ్రెస్ : 36.5%
బీజేపీ : 10.75%
ఏంఐఎం : 2.75%
ఇతరులు : 7.5%

https://x.com/BRSparty/status/1718821457931989088?s=20

Read more RELATED
Recommended to you

Latest news