నేడు వికారాబాద్ జిల్లాలో కేటీఆర్‌ పర్యటన

-

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా అభ్యర్థులంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. మూడోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారంలో ముందున్నారు. రోడ్​ షోలతో ప్రజల వద్దకు వెళ్లి తొమ్మిదన్నరేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ ఆయన వికారాబాద్​లో పర్యటించనున్నారు. చేవెళ్ల, వికారాబాద్​లో ఆయన రోడ్​ షోలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోనున్నారు. ఇప్పటికే నిర్వహించిన రోడ్ షోలలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఓవైపు ఎన్నికల ప్రచారంలో.. మరోవైపు సోషల్ మీడియాలో హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో అధికారం లేక ఆగమైన కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్ని మోసం చేసేందుకు కొత్త హామీలతో ముందుకువస్తోందని  విమర్శిస్తున్నారు. హస్తం పార్టీకి అధికారం కట్టబెడితే భస్మాసుర హస్తమేనని ప్రజలకు చెబుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news