IND vs NZ Semi Final : ఫైనల్ చేరిన భారత్.. చిత్తుగా ఓడిన కివీస్..

-

టీమిండియా ప్రభంజనం సృష్టించింది. న్యూజిలాండ్ పై సెమీస్ లో గెలిచిన భారత్….వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. ముంబైలోని వాంకడే స్టేడియంలో నవంబర్ 15న జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో భారత్ 70 పరుగులు తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టడంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది.

List Of Records Created By India During 70-Run Win Over New Zealand In 1st Semi-Final Of World Cup 2023
List Of Records Created By India During 70-Run Win Over New Zealand In 1st Semi-Final Of World Cup 2023

ఆ తర్వాత న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకే భారత బౌలర్లు ఆల్ అవుట్ చేశారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ పై 2019 పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అలాగే సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ కు చేరి టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది టీమిండియా. ఇక దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ కోల్కత్తా వేదికగా గురువారం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news