గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వం : KTR

-

గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గం. గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వం అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలు. కనీసం సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలి అని చెప్పారు. అదే విధంగా బండి సంజయ్ రేవంత్ రెడ్డి కావాలనే ఆడుతున్న డ్రామా ఇది. బండి సంజయ్ ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి ర్యాలీ చేయిస్తాడు రేవంత్. కానీ మా నాయకులను అరెస్ట్ చేస్తారు.

బండి సంజయ్ ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుంది. బండి సంజయ్ ఏం చదువుకున్నాడు ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుంది.. పరీక్ష పత్రాలు లీక్ చేయమంటే చేస్తాడు… అభ్యర్థుల తరఫున ఆయనేం చర్చిస్తారు. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు భరోసా ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక్క పంట కూడా రైతుబంధు ఇవ్వకుండా చేతులెత్తేశారు. కేసీఆర్ ముందే చెప్పాడు BRS ప్రభుత్వం ఉన్నంతవరకే రైతు బంధు అని… ఇప్పుడు అదే జరుగుతుంది.రేపు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా ఇవ్వనందుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. రైతులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనాలని కోరుతున్నాను అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version