పోటీ యాత్రలు కాదు ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయండి.. కాంగ్రెస్ కు కేటీఆర్ కౌంటర్

-

మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే “చలో మేడిగడ్డ” కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తూ బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామని అన్నారు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా కూలిపోవాలని చూస్తున్న హస్తం నేతల కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే తమ పర్యటన అని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలకు పాతరేస్తామని చెప్పారు

“పంజాబ్ నే తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టేందుకే ఈ “చలో మేడిగడ్డ”. మరమ్మత్తులు కూడా చేతకాని “గుంపుమేస్త్రీ”ని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడు ఖాయం. దశాబ్దాలపాటు కాంగ్రెస్ చేసిన తప్పులను కాంగ్రెస్ పాలనలో సాగునీటి తిప్పలను, అరవై ఏళ్లు కాంగ్రెస్ పెట్టిన అరిగోసను, అన్నదాతలు మరువలేదు. మళ్లీ కన్నీటి సాగుకు తెలంగాణను కేరాఫ్ గా మారిస్తే సహించం. పోటీ యాత్రలు చేయడం కాదు ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయండి.” అని కేటీఆర్ కాంగ్రెస్పై ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news