ఇవాళ మిడ్ మానేరులో బోటింగ్ యూనిట్ ను ప్రారంభించనున్న కేటీఆర్‌

-

 

నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ల పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం పదిన్నరకు కరీంనగర్ మానేరు వంతెన పై సర్వాయి పాపన్న జయంతి వేడుకలలో పాల్గొంటారు.

అనంతరం బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ హాల్లో 11 గంటలకు చేనేత వారోత్సవాల సమావేశం ఉంటుంది. అనంతరం మిడ్ మానేరు జలాశయంలో బోటింగ్ యూనిట్ ను సిరిసిల్లలో ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు KTR , శ్రీనివాస్ గౌడ్. జలాశయం అందాలను వీక్షించేందుకు బోటింగ్ యూనిట్ లో 120 మంది ఒకేసారి ప్రయాణించేలా డబుల్ డెక్కర్ ఎసి క్రూయిజ్ బోట్ , 20 మంది ప్రయాణించేలా అమెరికన్ ప్లాటూన్ డీలక్స్ బోట్, 4 గురు ప్రయాణించేలా స్పీడ్ బోట్ లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news