Bjp: ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ లో భారీ చేరికలు

-

కుత్బుల్లాపూర్, గాజుల రామారంలో ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ… నాలుగు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక హామీలు ప్రజలకు ఇచ్చారు. ప్రతీ మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకూ జరగలేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. వికలాంగులకు రూ. 6000 ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షలు రుణం ఇస్తామన్నారు.

etala

కూలీలకు, ఆటో కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు. వీటిలో ఏదీ నెరవేర్చలేదు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మళ్లీ ఎలా వేస్తారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కరోనా కాలంలో పేదలు ఆకలితో అలమటించకూడదని ప్రతీ ఇంటికీ నెలకు మనిషికి ఐదు కిలోల చొప్పున ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారని గుర్తు చేశారు ఈటల. కరోనా వ్యాక్సిన్లు రెండు డోసులు దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇప్పించిన వ్యక్తి నరేంద్రమోదీ అని కొనియాడారు. పేదల ఇళ్లలో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు చాలా ఇబ్బందులు పడేవారు. ప్రధాని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 12 కోట్ల టాయిలెట్లు కట్టించారు…..జన్ ధన్ ద్వారా 50 కోట్ల మంది పేదలకు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారు.

చిన్న వ్యాపారస్తులు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం కల్పించారని ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. 2 లక్షల 50 వేల ఇళ్లు ప్రధాని మోదీ పేదలకు కట్టించారు. ఆయుష్మాన్ భారత్ పధకం ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వరకూ వైద్యసదుపాయం కల్పించారు. ప్రమాదవశాత్తూ చనిపోతే 4 లక్షలు, ఆరోగ్య సమస్యలతో చనిపోతే 2 లక్షల ఇన్సురెన్స్ కల్పించారన్నారు.
మల్కాజ్‌గిరిలో నన్ను ఎంపీగా, నరేంద్రమోదీ గారిని ప్రధానిగా గెలిపించాలని అందరినీ కోరుతున్నానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news