తెలంగాణ రైతులకు శుభవార్త.. అర్హులైన రైతులకు రూ.లక్ష రుణమాఫీ

-

 

 

తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ఎదురుచూస్తున్న తెలంగాణ రైతన్నకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. లక్ష రూపాయల రుణమాఫీ పై తాజాగా కీలక ప్రకటన చేసింది కేసీఆర్ ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులందరికీ అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు రఘునందన్ రావు తెలిపారు. రైతుబంధు నిధులను వారి రుణ ఖాతాల్లో జమ చేయొద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ‘ఇప్పటివరకు 5,42,635 మంది రైతుల రుణాలను మాఫీ చేశాం. మిగిలిన వారి కోసం 2023-24 బడ్జెట్లో రూ. 6,325 కోట్లు కేటాయిస్తున్నాం’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news