వారం తర్వాత చెప్తా – మైనంపల్లి కీలక వ్యాఖ్యలు

-

మేడ్చల్ జిల్లా దూలపల్లి లోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసానికి నేడు మెదక్ జిల్లా నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తన కుమారుడు రోహిత్ కి మెదక్ అసెంబ్లీ టికెట్ ని బీఆర్ఎస్ నిరాకరించడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుచరులతో చర్చించారు మైనంపల్లి.

అనంతరం మీడియాతో మాట్లాడిన మైనంపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. వారం తర్వాత ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని అన్నారు. రేపటినుండి వారం రోజులపాటు మల్కాజ్గిరి లో పర్యటిస్తానని తెలిపారు. తనకి బీఆర్ఎస్ లోని పెద్ద లీడర్ ఫోన్ చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారని.. వారం తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు తెలియజేస్తానని అన్నారు.

మెదక్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని.. చర్యకు ప్రతి చర్య ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో తాను అణచివేతకు గురయ్యానని.. మెదక్ ప్రజలే తనకు రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. కాంగ్రెస్, బిజెపి, టిడిపి ఓట్లు వేస్తేనే తాను ఉప ఎన్నికలలో గెలిచానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news