మోడీ బహిరంగ సభను చరిత్ర సృష్టించేలా సక్సెస్ చేద్దాం – బండి సంజయ్

-

నేడు బీజేపీ హన్మకొండ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జిల్లా అధ్యక్షులు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జిల్లా ఇంఛార్జ్ మురళీధర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా గొప్ప మనిషి.

నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి. రాత్రింబవళ్లు కష్టపడే నాయకుడు. రేపు ఓకేరోజు మూడు రాష్రాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా తెలంగాణలోని హన్మకొండలో జరగబోయే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి చరిత్ర స్రుష్టించాలి’’అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభల్లో కొందరు బీఆర్ఎస్ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను ప్రత్యేకంగా పట్టి జై జై అంటూ నినాదాలు చేయించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని… అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news