నామినేషన్లకు నేడే చివరి రోజు.. ఇప్పటివరకు 478మంది దాఖలు

-

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇవాళ్టితో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించిన పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు దాఖలయ్యాయి.

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సాధారణ, శాంతి భద్రతల, ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. వీరు ఇవాళ ఆయా నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుంటారు. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులు, శాంతిభద్రతల పరిశీలకులుగా ఐపీఎస్‌ అధికారులు, వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌, ఐటీకి చెందిన అధికారులను నియమించగా.. వీరు ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను సైతం స్వీకరిస్తారు. మరోోవైపు రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మే 12న, జూన్‌ 4న సెలవుదినాలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news