ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు – సీఎం జగన్

-

మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్‌ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ… పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు.

cm jagan

పులివెందులలో ఏముంది అని చెప్పండి అని అడిగితే, ఏమీ లేదో చెప్పండి అని అడిగే పరిస్థితి తీసుకొచ్చా..మాట ఇస్తే మడమ తిప్పమని తెలుగు నేలపై ఆడుగడుగునా నింపింది మీ పులివెందుల బెడ్డే అన్నారు.రాయలసీమ మంచితనం మాటపై నిలబడే గుండె ధైర్యం చూసి ప్రతి గ్రామంలో వైసీపీని ఆదరిస్తున్నారని వెల్లడించారు. వైఎస్ఆర్ వారసులం అంటూ వస్తున్న వారి కుట్రలు చూస్తున్నామని.. ఆ మహానేతకు ఎవరు వారసులనేది చెప్పాల్సింది ప్రజలు కాదా అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక ఆయన కుటుంబం మీద కుట్రలు చేసింది ఎవరు అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news