TSPSC చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి

-

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రటరీ అనితా రామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజినీకుమారి, అనితా రాజేంద్రతో మహేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఇటీవలే కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ.. గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

TSPSC ని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇచ్చిన మాట ప్రకారమే.. కొత్త బోర్డును నియమించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాయిదా పడినట్టు పరీక్షల నిర్వహణ సక్రమంగా ఉంటుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిరుద్యోగులు నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఆశ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news