మునుగోడులో కలకలం.. కోమటిరెడ్డి స్వగ్రామానికి చెందిన యువకుడిపై కాల్పులు

-

నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి వద్ద కాల్పుల కలకలం రేగింది. బైకుపై వెళ్తున్న యువకుడిపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. యువకుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కాగా.. వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు బ్రాహ్మణవెళ్లెంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు కోమటిరెడ్డి స్వగ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news