బంజారాహిల్స్‌లో భారీ చోరీ…!

-

హైదరాబాద్‌ మహానగరంలోని బంజారాహిల్స్‌లో శనివారం భారీ చోరీ జరిగింది. ఓ బిల్డర్‌ కార్యాలయంలోకి చొరబడిన దుండగుడు విలువైన భూముల డాక్యుమెంట్లు, రివాల్వర్‌, 20 బుల్లెట్లను అపహరించాడు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్‌ అధినేత కోటారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని చోరీకి పాల్పడిన సుధీర్‌ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలిపారు.

robery - police
robery – police

సుధీర్ రెడ్డి అనే వ్యక్తి చొరబడి రూ. పది కోట్ల విలువైన భూములకు సంబంధించిన పత్రాలను అపహరించారు. ఈ పత్రాలను శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్‌‌ లో దొంగిలించడమే కాకుండా, ఒక రివాల్వర్ ‌తో పాటు… 20 బుల్లెట్లను కూడా నిందితుడు చోరీ చేశాడు. శనివారం ఉదయం శ్రీ ఆదిత్య హోమ్స్ చైర్మన్ కోటారెడ్డి అక్కడకు వచ్చినప్పుడు ఆఫీసులో మొత్తం చిందర వందరగా పడి ఉండటం గుర్తించారు. తన ఆఫీస్ లో చోరీ జరిగినట్లుగా గుర్తించి వెంటనే స్థానిక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల్ని గుర్తించారు. నిందితుడు సుధీర్ రెడ్డి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news