నేటి నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు వెబ్‌ఆప్షన్లు

-

రాష్ట్రంలో.. ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్​ను కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఇవాళ ఉదయం 6గంటల నుంచి 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రం లోని ప్రైవేట్ వైద్య దంత  కళాశాలల్లో  ఎంబీబీఎస్, బీడీఎస్​ కోర్సుల ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధి కళాశాలల్లోని యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.

జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయింత్రం 5 గంటల  వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి  యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news