బీజేపీకి బిగ్ షాక్..పన్నాల హరీష్ రెడ్డి రాజీనామా

-

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్న బీజేపీ తాజాగా లోక్ సభ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించింది.16 రాష్ట్రాల్లోని 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది. ఇక మార్చి 15 లోపే మొత్తం అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Medchal district BJP president Pannala Harish Reddy has resigned

ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని ప్రకటించడానికి ముందే ప్రచారానికి సన్నద్ధమయ్యేలా అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది. ఈ తరుణంలోనే…బీజేపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి రాజీనామా చేశారు. మల్కాజ్‌గిరి టికెట్ ఆశించిన పన్నాల హరీష్ రెడ్డిని కాదని ఈటల రాజేందర్‌కు కేటాయించడంతో తీవ్ర మనస్తాపం చెందిన హరీష్ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి లేఖను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news