25న ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల స‌మ‌యం పొడిగింపు

-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా మెట్రోలో ప్రయాణించే వారు తప్పక తెలుకోవాల్సిన విషయం. ఈ నెల 25వ తేదీన మెట్రో రైలు సేవల సమయం పొడిగించారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25వ తేదీన ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు – స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్లు తలపడనున్నాయి.

గురువారం రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.  ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైలు స‌మ‌యం పొడిగించారు. ఆ రోజు మెట్రో రైళ్లు నిర్ణీత స‌మ‌యానికి మించి న‌డుస్తాయ‌న్నారు. నాగోల్, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేష‌న్‌లలో చివ‌రి రైళ్లు రాత్రి 12:15 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి 1:10 గంట‌ల‌కు గ‌మ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో అధికారులు వెల్లడించారు. ఐపీఎల్ సమయంలో సాధారణంగా ఎప్పుడు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉన్నా.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news