మన రాష్ట్రంలో ఉన్న పథకాలు ఏ రాష్ట్రం లో లేవు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

-

దళిత బంధు, రైతు బంధు, రైతు భీమా ఇలా మన పథకాలు ఏ రాష్ట్రం లో లేవు అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇవాళ సంగెం మండలంలోనీ గుంటూరుపల్లి గ్రామంలోరూ.3 కోట్ల 10 లక్షలు,కాపులకనపర్తి గ్రామంలోరూ.8 కోట్ల 18 లక్షలు ,గవిచర్ల గ్రామంలో రూ.14 కోట్ల 19 లక్షలతో మహిళా భవనాలు,సిసి రోడ్లు, బి.టి.రోడ్లు ,కమ్యూనిటీ భవనాలు,గ్రామ పంచాయతీ భవనం,మహిళా సంఘాల భవనాలు ,సబ్ స్టేషన్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం , పలు అభవృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

రైతులకు పంటనష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంగేం మండలం అభివృద్ధికి అత్యధిక నిధులను కేటాయించామని తెలిపారు.  పటిష్టమైన విజన్ తో ముఖ్య మంత్రికెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఇంటికి మంచినీటి నల్లా,టాయిలెట్ ప్రతీ గ్రామానికి బిటి, సిసి రోడ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణ వచ్చాక రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం.

మహిళల గ్రూప్ సభ్యులకు 22000 కోట్ల లోన్ లు ఇచ్చాం.  మహిళలు ప్రభుత్వం ఇచ్చే లోన్ లతో  సొంతం గా బిజినెస్ చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. అభయ హస్తం డబ్బులు వారం రోజుల్లో ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. వేరే రాష్ట్రాలలో ఇంకా నీటి కోసం బిందెలు పట్టుకొని సూదుర ప్రాంతాలకి వెళ్తున్నారని.. వివిధ రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన మహిళా గ్రూప్ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news