BRS ప్రభుత్వానికి అవమానకరమైన విషయం..!

-

నారపల్లి ఫ్లై ఓవర్ స్టార్టింగ్ పాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్ అండ్ బి సెక్రటరీ దాసరి హరిచందన పాల్గొన్నారు. వారం రోజుల్లో కొత్త టెండర్ల కు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… 2018 నుండి నేటి వరకు పనులు పూర్తి కాకపోవడం తెలంగాణ గత రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరం అని పేర్కొన్నారు.

మూసి తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి ఈ హైవే లో ఫ్లైఓవర్ పూర్తిగాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో గుంతలో పడి అనేక ముందుకి యాక్సిడెంట్లు అవుతున్నాయి. వెంటనే ఆర్&బీ అధికారులతో కలిసి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కి, తనకు ఎస్టిమేషన్ నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆరు సంవత్సరాల నుంచి పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news