నేడు నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలు

-

నేడు నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో లు నిర్వహించనున్నారు. మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షోలో పాల్గొననున్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు brs నేతలు.

Minister KTR roadshows in four areas today

ఇది ఇలా ఉండగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరులో నిర్వహించనున్న సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగాల్లో ఎక్కువగా కాంగ్రెస్​పై విమర్శలు.. తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించే ఉంటోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్.. తాను పాల్గొంటున్న ప్రతి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగాన్ని ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూనే షురూ చేస్తున్నారు. ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధం ఐదేళ్ల వారి భవిష్యత్​నే కాకుండా రాష్ట్ర భవిష్యత్​ను కూడా మార్చేస్తుందంంటూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news