మహాలక్ష్మి పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన !

-

మహాలక్ష్మి పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వంతో బడ్జెట్ ప్రతిపదనాల కోసం సమీక్షా సమావేశాలు కొనసాగుతుండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ తన శాఖల పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బడ్జెట్ ప్రతిపాదనల పై రవాణా ఆర్టీసీ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.. రవాణా శాఖలో వస్తున్న ఆదాయం, వ్యయాలు కేటాయింపులు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలు తదితర అంశాల పై చర్చించారు.

Minister Ponnam Prabhakar

ఇక ఆర్టీసీ కి సంబంధించి గత సంవత్సరం బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఎన్ని…విడుదల చేసిన బడ్జెట్ ఎంత..? ఈసారి మహాలక్ష్మి పథకం ద్వారా బడ్జెట్ లో కేటాయింపులు ఎన్ని..కొత్త బస్సుల కొనుగోలు తదితర అంశాల పై చర్చించారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపుల వివరాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే సమావేశంలో పూర్తి స్థాయి ప్రసెంటేషన్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తమ ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలు చెప్పట్టిందని అందుకు అయ్యే బడ్జెట్ వివరాలు తదితర అంశాల పై అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news