కేటీఆర్‌ ఇలాకలో బీఆర్ఎస్‌ కీలక నేత మృతి

-

కేటీఆర్‌ ఇలాక అయిన సిరిసిల్లా నియోజక వర్గంలో బీఆర్ఎస్‌ కీలక నేత, సెస్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి మృతి చెందారు. తీవ్ర అనారోగ్యం కారణంగా.. సెస్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి మరణించారని సమాచారం. అయితే.. సెస్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సిరిసిల్ల సెస్ మా జీ ఛైర్మన్ దోర్నాల లక్ష్మా రెడ్డి మృ తి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి శ్రీ కేటీఆర్ గారు సం తాపం ప్రకటించారు. విదేశీ పర్యటనలో ఉన్న తనకు లక్ష్మారెడ్డి గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిం దన్నారు. లక్ష్మారెడ్డి తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పార్టీ అభివృద్ధికి, సెస్ మనుగడ కు విశేష కృషి చేసిన లక్ష్మారెడ్డి మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని ప్రకటించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news