2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

-

తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కు హబ్‌గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వారికి మంత్రి వివరించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ గురించి మంత్రి శ్రీధర్ బాబు ఆ ప్రతినిధులకు వివరించారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్‌గా హైదరాబాద్ మారుతుందని.. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటును ఒక్క హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా.. వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news