రైతుకు ఉన్నన్ని శాపాలు ఎవరికి ఉండవు : మంత్రి తుమ్మల

-

రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ పెద్ద ఎత్తున సాగుచేయడం కోసం మన రాష్ట్రంలో 31 జిల్లాలకు అనుమతులు ఉన్నాయి. రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ తో పాటుగా 14 ప్రయివేటు కంపెనీలు పామాయిల్ విస్తరణ కు ముందుకొచ్చాయి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఆయిల్ ఫెడ్ కేంద్రం ఉంటుంది. ఏడాదికి లక్ష ఎకరాల లక్ష్యం ఉంది కాని ముందుకు వెళ్లడం లేదు. రాష్ట్రంలో 80 శాతం చిన్న సన్నకారు రైతులున్నారు. పామాయిల్ సాగులో అంతర పంటలకు సైతం సబ్సిడీ ఇస్తాము. అయితే మలేషియాలో అంతర పంటలు లేవు. గుట్టల పైనే సాగు చేస్తున్నారు. పొట్టి విత్తనం ,మిషన్ లు పరిశీలన కు వెళ్లాం. ఫైబర్ గెడలు సౌకర్యంగా ఉన్నాయి. సబ్సిడీతో గెడలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.

మనకంటే మెరుగైన పద్ధతులు అన్వేషించాం కానీ ఆశించినంతగా లేవు. పామాయిల్ వ్యర్ధాల తో వస్తువుల తయారీ యూనిట్ లు పెట్టుకోమని మలేషియా వారిని ఆడిగాం. 70 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే దిగుమతి అవసరం లేదు. పామాయిల్ మధ్యలో ములగా అంతర పంటగా వేయాలి. కొబ్బరి కూడా అంతర పంటలకు అనుకులమే. వక్క సాగు లాభదాయకంగా ఉంటుందేమో పరిశీలిస్తున్నాం. అధికారుల బృందాలను కర్ణాటక పంపి వక్కపై పరిశీలన చేస్తాం. అయితే రైతుకు ఉన్న శాపాలు ఎవరికి ఉండవు. నష్టం వచ్చినా పంట వెయ్యాలి. పామాయిల్ కు 20 వేలు కనీస ధర ఇచ్చేలా డిమాండ్ చేస్తున్నా అని మంత్రి తుమ్మల అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news