సిద్దిపేట కాలేజీని సీఎం గద్దలా తన్నుకుపోయాడు..!

-

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులను పంపిణీ చేసారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యధిక CMRF చెక్కులు అందినటువంటి నియోజకవర్గం సిద్దిపేట. కేసీఆర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా సిద్దిపేటను మనం తీర్చిదిద్దుకున్నాం. కానీ మన సిద్దిపేటలో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్‌ కు తరలించుకుపోయింది.

కొడంగల్‌ కు అవసరమైతే కొత్త కాలేజీని నిర్మించుకోవాలి గాని.. సిద్దిపేటకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీశ్ రావు. అలాగే 150 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వెటర్నరీ కాలేజీని గద్దలా తన్నుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలు గమనించాలి. ఏది ఏమైనా అసెంబ్లీలో కొట్లాడి సిద్దిపేటకు రావాల్సిన పనులను హక్కుగా తీసుకొని వస్తా. నా ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా అని హరీశ్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news