సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ

-

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్లారు. ఆదివారం సీఎంతో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీ అంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎంను కలవడం వెనక ఆంతర్యమేంటని రాష్ట్ర ప్రజలు సరికొత్త చర్చ మొదలైంది. ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా సీఎం న కలిసిన విషయం తెలిసిందే.

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు  సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.  ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవడం తీవ్రతమారాన్ని రేపింది. తాము మర్యాదపూర్వకంగానే కలిసినట్టు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడంతో అనుమానాలకు పుల్ స్టాప్ పడింది. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సింగిల్ గా కలవడం చర్చనీయంశం గా మారింది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేటీఆర్ హరీష్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత సహకారంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news