కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగలం : ఎమ్మెల్యే రాజయ్య

-

గత కొంతకాలంగా స్టేషన్​ఘన్​పూర్​లో రాజకీయం రాజుకుంటోంది. ఓవైపు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. మరోవైపు ఎమ్మెల్యే రాజయ్య వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవలే జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం నియోజకవర్గంలో మరింత అగ్గి రాజేసింది. సమయం దొరికితే చాలు కడియం, రాజయ్యలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

తన వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ  నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కులం పేరుతోనూ కడియం అక్రమంగా రిజర్వేషన్‌ను పొందారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగానికి పాల్పడి ఆస్తులు కూడబెట్టుకున్నారని అన్నారు. కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగలం అంటూ మండిపడ్డారు. ఘణపురం గడ్డ నాదే…. అడ్డ నాదే అంటూ ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర స్థాయిలో కడియంపై విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news