ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ప్రకటన

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. అయితే హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని వెల్లడించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కవిత… ఎల్లుండి తాను దిల్లీలో నిరసన దీక్ష తలపెట్టాననీ…ఈ క్రమంలోనే రేపు విచారణకు రావాలని ఈడీ ఆదేశించిందని అన్నారు.

‘రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 9న దిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను.’ అని కవిత ఓ ప్రకటనలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news