త్వరలో మౌలాలి – హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ రైళ్లు

-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. త్వరలో మౌలాలి నుంచి హైటెక్ సిటీకి ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో భాగంగా మౌలాలి – సనత్‌నగర్‌ మధ్య నిర్మిస్తున్న రెండో లైను పనులు పూర్తవ్వడంతో మౌలాలి నుంచి నేరుగా హైటెక్‌సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటీఎస్‌ రైళ్లు నడవనున్నాయి. ఫిబ్రవరిలోపే ఈ మార్గంలో ఎంఎంటీఎస్‌లు పట్టాలెక్కనున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్‌ సిటీ వైపు ప్రయాణ కష్టాలు తీరుతాయని వెల్లడించాయి.

మౌలాలి – సనత్‌నగర్‌ మధ్య మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో 6 స్టేషన్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. సనత్‌నగర్‌, పీర్జాదిగూడ, సుచిత్ర సెంటర్‌, భూదేవినగర్‌, అమ్ముగూడ, నేరేడ్‌మెట్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ(ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు), మౌలాలి స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లు నడవనున్నాయి. ప్రస్తుతం అక్కడివారు ఐటీ కారిడార్‌కు రావాలంటే నేరేడ్‌మెట్‌, ఆర్‌కేపురం వంతెన, కంటోన్మెంట్‌, బేగంపేట మీదుగా సొంత వాహనాల్లో నానా అవస్థలు పడేవారు. త్వరలోనే వీరికి ఈ కష్టాలు తీరనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news