టార్గెట్ అచీవ్డ్.. లక్ష దాటిన మద్యం దుకాణాల దరఖాస్తులు

-

 తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగిసింది. దరఖాస్తులు లక్ష దాటినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది లక్ష దరఖాస్తులను టార్గెట్ గా పెట్టుకున్న సర్కార్.. ఆ లక్ష్యం చేరువుతుందో లేదోనని కాస్త గందరగోళంలో పడింది. కానీ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని సాధించింది.

చివరి రోజు కావడంతో ఇవాళ భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వివరించారు. చివరి రోజు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. గురువారం వరకు 69,965 వచ్చిన దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,399 కోట్లు ఆదాయం సమకూరింది.

రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. డ్రాలో పాల్గొనే వారు రూ.2 లక్షలు తిరిగి ఇవ్వని నగదు చలాన్‌ (డీడీ)తో దరఖాస్తు సమర్పించారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయించనున్నారు. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్‌ కేటగిరీ కింద ఉన్నట్లు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news