కాంగ్రెస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు

-

సీఎం కేసీఆర్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చారు మోత్కుపల్లి నరసింహులు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు మోత్కుపల్లి నరసింహులు. మోత్కుపల్లి నరసింహులుతో పాటు… కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.

Motkupalli Narasimhu joined the Congress party

ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ను గద్దే దింపేందుకు కాంగ్రెస్ లో చేరానన్నారు. పదవులు నాకు ముఖ్యం కాదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. కుటుంబ పాలనను అంతం చేస్తానని… కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోందని జోష్యం చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాగా రేవంత్ రెడ్డి నా తమ్ముడు..అతనితో నాకు శత్రుత్వం లేదని ఇటీవలే మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ను నమ్మి మోసపోయానని మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మోత్కుపల్లి నరసింహులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version