TRS కు కుక్క కూడా ఓటేయదు.. ఆ పార్టీ గెలిస్తే గొంతు కోసుకుంటా: ఎంపి అరవింద్

-

బిజెపి ఎంపీ అరవింద్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ లో కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో కొనసాగితే గనుక తాను గొంతు కోసుకుని అని అరవింద్ సవాల్ విసిరారు. మెదక్ జిల్లా రామాయణం పేట లో ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకుల కుటుంబాన్ని అరవింద శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యాపారం చేసుకుంటున్న సంతోష్ కుటుంబాన్ని వేధింపులకు గురి చేయడంతో పాటు వారి ఆత్మహత్యకు పాల్పడ్డారని అరవింద్ ఆరోపించారు. తెలంగాణ సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ సొంత తప్పి పడుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలకు సీఎం కేసీఆర్ కొడుకు.. మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్ పార్టీ చిన్న దొర అండతో ఎక్కడికక్కడ గులాబీ నేతలు, వారి ప్రోద్బలంతో పోలీసులు రెచ్చిపోతూ సామాన్యులను ఇక్కట్లకు గురి చేస్తున్నారని నిప్పులు చెరిగారు ఎంపీ అరవింద్.

Read more RELATED
Recommended to you

Latest news