పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాలు బొక్క బోర్లా పడ్డాయి – ఎంపీ లక్ష్మణ్

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ పట్ల ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాలు బొక్క బోర్లా పడ్డాయని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో విపక్షాలు సభలో లేవని.. మరి అలాంటప్పుడు అవిశ్వాసం పెట్టడం ఎందుకని ప్రశ్నించారు.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చివరి వరకు లేకుండా పారిపోవడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం ఢిల్లీలో బహిర్గతమైందన్నారు లక్ష్మణ్. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడానికి బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయం అని అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి బండి సంజయ్ చాలా చక్కగా మాట్లాడారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news