ఐటీ సోదాలపై స్పందించిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి

-

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో నేడు ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటితోపాటు కార్యాలయాలలోనూ దాడులు చేపట్టారు. ప్రభాకర్ రెడ్డి నివాసం ముందు కేంద్ర బలగాలు పహారా కాస్తుండగా.. అధికారులు లోపల సోదాలు చేపట్టారు. కొండాపూర్ లోని లుంబిని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్ లో ఎంపీ ఉండే ఇంటితో పాటు కార్యాలయాల పైన ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

అయితే ఈ సోదాలపై తాజాగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. 1986 నుండి వ్యాపారం చేస్తున్నానని.. అప్పటినుండి తనది వైట్ పేపర్ బిజినెస్ అని తెలిపారు. తన ఇంటిపై ఐటి దాడులు అంటే కొండను తవ్వి ఎలుకను పట్టడమేనని అన్నారు. ఎన్నికల ముందు బద్నాం చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు ప్రభాకర్ రెడ్డి. ఇంతకుముందు ఎన్నడూ లేని ఐటీ దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో గమనించాలని ప్రజలను కోరారు. ఇది కేవలం బురదజల్లే ప్రయత్నం అన్నారు ప్రభాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news