కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, దానం నాగేందర్

-

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసకట్టి వీడుతున్నారు. ఇప్పటికే ఐదురుగు ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక కీలక నేతలు కూడా చాలా మంది కారు దిగారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా ప్రకటించిన గంట వ్యవధిలో ఆయన ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఈ ఇరువురు నేతలు హస్తం కండువా కప్పుకున్నారు.

అంతకుముందు రంజిత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్టు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు రంజిత్‌ రెడ్డి వెల్లడించారు. ఇన్ని రోజులు  చేవెళ్ల ప్రజలకి సేవ చేసేందుకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లుగా తనకు పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ ఎంపీ రంజిత్‌రెడ్డి  కృతజ్ఞతలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version